జాతీయ ఆరోగ్య మిషన్ పునరుత్పత్తి మరియు శిశు ఆరోగ్యం (ఆర్ సి హెచ్ ) పోర్టల్ కర్ణాటకలో కేవలం 11 నెలల్లో 28,657 మంది మైనర్ బాలికలు గర్బం దాల్చారని పేర్కొంది. వీరిలో 558 మంది గర్భిణీ బాలికలు 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు కావడం విశేషం. గత ఏడాది జనవరి నుండి నవంబర్ వరకు సగటున 2,600 కేసులు నమోదయ్యాయని తెలిపింది. బాలల హక్కుల కార్యకర్తలు, ఆరోగ్య శాఖ అధికారులు మరియు అధికారులు ఈ సంఖ్యతో ఆశ్చర్యపోయారు. డేటా యొక్క వాస్తవికతను తనిఖీ చేయడానికి మళ్లీ సర్వే చేయాలని భావిస్తున్నారు.సామాజిక, ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఇది తక్షణ, సమర్థవంతమైన చర్యలను చేపట్టాలని ఈ డేటా చెబుతోంది. ఈ పరిస్థితి కేవలం ఆరోగ్య సంక్షోభం మాత్రమే కాదు, సామాజికమైనది కూడా, ఇది బాల్య వివాహాలు, లైంగిక నేరాలు, ప్రేమ వ్యవహారాలు అంతర్లీన సమస్యలను ప్రతిబింబిస్తుందని కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ సభ్యుడు మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మాజీ చైర్పర్సన్ వాసుదేవ శర్మ చెప్పారు. ప్రేమ వ్యవహారాలు,పారిపోవడం కూడా టీనేజ్ గర్భాలకు కారణమవుతోంది. వారికి కౌన్సిలింగ్ చేసేవారు ఎవరూ లేరని నిపుణులు చెబుతున్నారు. ఉదారవాద సామాజిక నిబంధనలు, పాశ్చాత్యీకరణ, మీడియా ప్రభావం కారణంగా లైంగిక వేధింపులు పెరుగుతున్నాయని అన్నారు. పాఠశాల స్థాయిలో మానవ శరీరం, గర్భం, సురక్షితమైన సెక్స్ పద్ధతులు ,లైంగికత గురించి చెప్పాలి. తక్కువ వయస్సు గల గర్భిణీలకు సంబంధించిన ఆరోగ్య మరియు చట్టపరమైన సమస్యలపై పాఠశాల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని శర్మ అభిప్రాయపడ్డారు. లైంగిక నేరాలకు వ్యతిరేకంగా పిల్లల రక్షణ చట్టం (పోక్సో), అత్యాచారాలపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ను బాలబాలికలకు వివరించాలని శర్మ అన్నారు.
కర్ణాటకలో గర్భం దాల్చిన 28 వేల మంది మైనర్ బాలికలు ?
January 20, 2024
0
Tags