జమ్మూలో ట్రక్కు బ్రిడ్జి డివైడర్ని ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇవాళ(శుక్రవారం) జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవేపై ఉన్న బ్రిడ్జి డివైడర్ని ట్రక్కు ఢీకొట్టింది.ఈ ఘటన ఝజ్జర్కోట్లి దగ్గర జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్తో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ట్రక్కు బోల్తాపడిన ఘటనలో నలుగురు మృతి !
October 20, 2023
0
Tags