ఉత్తరాఖండ్‌లో భూకంపం

Telugu Lo Computer
0

త్తరాఖండ్‌లో 4.3 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్‌లోని జోషిమత్ పట్టణానికి ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేపాల్‌లో రెండో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్‌లో 6.2 భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత ఢిల్లీతోపాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లోని ఇతర ప్రాంతాల్లోనూ భూకంపం సంభవించింది. నోయిడాలో 10 నుంచి 15 సెకన్ల పాటు భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భూప్రకంపనల దాటికి.. సౌత్ ఢిల్లీలోని ఓ కాలేజీకి చెందిన తరగతి గదిలో బ్లాక్ బోర్డ్ పగిలిపోయింది. ఇదిలా ఉంటే.. ఉత్తరాది రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, బరేలీలో కూడా భూకంపం సంభవించింది. ఆ తర్వాత కొద్ది సమయంలోనే మరోసారి ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు సంభవించాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)