బడికెళ్లి పాఠాలు చదువుతున్న బామ్మ !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌, చావ్లీ గ్రామంలో నివసిస్తున్న 92 ఏళ్ల సలీమా ఖాన్  చదవడం మరియు వ్రాయడం నేర్చుకోవడం కోసం పాఠశాలలో అడుగుపెట్టడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సలీమా ఖాన్ కుటుంబ సభ్యుల సహాయంతో పాఠశాలకు వెళుతుంది. ఈ వయస్సులో తాను చదువుకుంటున్నందుకు గర్వపడుతున్నానని చెప్పింది, 'నేను నా పేరు మీద సంతకం చేయడం నేర్చుకున్నాను అని బోసినవ్వుల బామ్మ ఆనందంతో చెబుతోంది. ఆమె చదువుతున్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, డాక్టర్ ప్రతిభా శర్మ మాట్లాడుతూ.. 'సలీమా ఎనిమిది నెలల క్రితం మా వద్దకు వచ్చి తరగతి గదిలో కూర్చోవడానికి అనుమతించమని అభ్యర్థించారు. అటువంటి వృద్ధురాలికి విద్యను అందించడం చాలా కష్టం, కాబట్టి మేము మొదట్లో కొంత సంకోచించాము. అయితే, ఆమె జీవితంలోని శరదృతువులో చదువుకోవాలనే ఆమె మక్కువ మమ్మల్ని మార్చేలా చేసింది. ఆమెను తిరస్కరించేందుకు మాకు మనసు రాలేదు.' 1 నుండి 100 వరకు అంకెలు నేర్పించడం, అక్షరాలు నేర్పించడం చేస్తున్నాము అని ఆమె చెప్పారు. సలీమా ఖాన్ తన చుట్టూ ఉన్న చాలా మంది మహిళలకు గొప్ప ప్రేరణ. సలీమాను చూసి గ్రామానికి చెందిన 25 మంది మహిళలు, ఆమె ఇద్దరు కోడళ్లు తరగతుల్లో చేరేందుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు వారి కోసం ప్రత్యేక సమావేశాలు ప్రారంభించాం.' సలీమా ఖాన్ 14 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్నారు. ఆమె గ్రామంలో పాఠశాలలు లేవు. పెళ్లి తరువాత పిల్లలు, వారిని పెంచి పెద్ద చేయడం, వాళ్లకి పెళ్లిళ్లు, పిల్లలు వీటితోనే జీవితం మొత్తం గడిచి పోయింది. చదువుకోవాలని ఉన్న తన కోరిక అలానే మిగిలిపోయింది. ప్రధానోపాధ్యాయురాలు తనకు పుస్తకం ఇస్తే పెన్ను పట్టుకోవడం కూడా తెలియక చేతులు వణుకుతున్నాయని చెప్పింది. అయితే తన ఆనందానికి అవధులు లేవని పేర్కొంది. 'ఖాన్ చాచీ' నేర్చుకునేందుకు వయస్సు లేదని మరోసారి నిరూపించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)