పేలుడు పదార్థాలు.ధ్వంసం చేసిన బాంబు స్క్వాడ్ !

Telugu Lo Computer
0


మ్మూకశ్మీరులో సోమవారం పేలుడు పదార్థాలను కేంద్ర భద్రతా బలగాలు కనుగొన్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పట్టన్ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలు ఐఈడీ లాంటి వస్తువును గుర్తించారు. దీంతో శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున జాతీయ రహదారిపై హంజీవీరా వద్ద బ్యాగ్‌లో ఉంచిన అనుమానిత ఐఇడిని బలగాలు కనుగొన్నామని కేంద్ర భద్రతా బలగాలు తెలిపాయి. ముందుజాగ్రత్త చర్యగా హైవేపై ట్రాఫిక్‌ను నిలిపివేశామని, అనుమానిత ఐఈడీని నిర్వీర్యం చేసేందుకు బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను పిలిపించినట్లు వారు పేర్కొన్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ పేలుడు పదార్థాలను సమీపంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి, ఎలాంటి నష్టం లేకుండా ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)