కంది పప్పు రేట్ల పెరుగుదలతో సామాన్యులు పరేషాన్ అవుతున్నారు. రెండు నెలల క్రితం రిటైల్ మార్కెట్లో నాణ్యతను బట్టి కిలో కంది పప్పు రూ.95-110కి విక్రయించగా, ప్రస్తుతం కిలో రూ.130-150 వరకు విక్రయిస్తున్నారు. మసూర్ పప్పు కూడా గత నెలలో కిలో రూ.70 ఉండగా, కిలో రూ.100పైగా పెరిగింది. అలాగే ఉడక పప్పు ధర కూడా రూ.130 మార్కును తాకింది. ప్రతి నెలా ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి ఇష్టపడే కస్టమర్లు కూడా ధరల పెంపును చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆన్లైన్లో పప్పు కిలో రూ. 137-160కి లభిస్తుండగా, అదే ఆర్గానిక్ వెర్షన్ కిలో రూ. 200-250కి లభిస్తుంది. ముఖ్యంగా పప్పు ధరలు బాగా పెరగడం, ఇప్పటికే ద్రవ్యోల్బణ ఒత్తిడితో కొట్టుమిట్టాడుతున్న వారికి మరింత ఆందోళనను కలిగిస్తోంది. ఈ ఏడాది పప్పుల ఉత్పత్తి తక్కువగా ఉండటమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. "వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, అకాల వర్షాలు, చాలా మంది రైతులు పప్పుధాన్యాల కంటే సులభంగా పండించగల పంటలను ఇష్టపడడం ఫలితంగా పప్పుధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉంది. అందువల్ల ఇది సప్లై, డిమాండ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది" అని ఒక వ్యాపారి చెప్పారు. ఈ క్రమంలో పప్పుల ధరలు మరింత పెరుగుతాయని, పప్పు కిలోకు రూ.200కి చేరవచ్చని చర్చ జరుగుతోంది.
కంది పప్పు రేట్లతో సామాన్యుల పరేషాన్ !
June 26, 2023
0
Tags