ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లా గంగలూర్ పరిధిలోని హీరేలీలో పోలీసుల శిబిరంపై రాకెట్ లాంఛర్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ మేరకు బీజాపుర్ ఎస్పీ వర్షనేయ ధ్రువీకరించారు. అయితే, ఈ ఘటనలో పోలీసులకు ఎలాంటి ఆపద కలగలేదని తెలుస్తోంది. మరోవైపు కోబ్రా దళాలు రంగంలోకి దిగాయి. మావోయిస్టుల కోసం గాలింపు చేపడుతున్నాయి.
పోలీసు శిబిరంపై మావోయిస్టుల దాడి
June 23, 2023
0
Tags