రైలు ఆలస్యమైతే ఉచిత భోజన సౌకర్యం !

Telugu Lo Computer
0


భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు రైలు ప్రయాణీకులకు అనేక ఉచిత సౌకర్యాలను అందిస్తుంది. ఇకపై రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందజేస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కొత్త నిబంధన ప్రకారం రైలులో ప్రయాణించేటప్పుడు భోజనానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.  చాలా సందర్భాల్లో రైలు ఆలస్యం కావడం సర్వసాధారణం. కానీ, ఇప్పుడు రైలు ఆలస్యమైతే రైల్వే శాఖ మీకు భోజన సౌకర్యాలను కల్పించనుంది. ఆలస్యానికి ఫలితంగా ప్రయాణికులకు ఉచిత ఆహారం అందజేస్తుంది. రైల్వే కొన్ని ప్రత్యేక ప్రయాణీకులకు ఉచిత ఆహార సౌకర్యాన్ని అందిస్తుంది. నిబంధనల ప్రకారం, ప్రయాణీకులకు ఉచిత భోజనం అందిస్తారు. మీరు ప్రయాణించే రైలు 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయినప్పుడు భోజన సౌకర్యం కల్పిస్తుంది. ఇకపోతే, ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు మాత్రమే ఈ సదుపాయాన్ని కల్పించనున్నారు. శతాబ్ది, రాజధాని, దురంతో వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి ఈ సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైల్వే సమాచారం ప్రకారం, ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి కూడా ఈ సౌకర్యం కల్పించబడింది . ఏదైనా కారణం చేత మీరు రైలును మిస్‌ చేసుకున్నట్టయితే, మీరు వాపసు పొందవచ్చు. దీని కోసం, రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన 1 గంటలోపు టిడిఆర్ ఫారమ్ నింపి టిక్కెట్ కౌంటర్‌లో సమర్పించాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)