'ఆనందబజార్ పత్రిక' శతాబ్ది ఉత్సవాల్లో వర్చువల్ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ 'రాజకీయ అవకాశవాదంతో భారతీయులను విభజించి.. హిందువులు, ముస్లింల సహజీవనంలో చీలిక తెచ్చే ప్రయత్నం జరుగుతోంది' అన్నారు. మాతృభాష దినపత్రిక మొదటి ఎడిషన్ మార్చి 13, 1922న ప్రచురించబడింది. ప్రఫుల్లకుమార్ సర్కార్ దాని వ్యవస్థాపక-సంపాదకుడు. "ఆ సమయంలో (1922), రాజకీయ కారణాల వల్ల దేశంలో చాలా మంది వ్యక్తులు జైలు పాలయ్యారు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని మరియు తరచూ ఇలా ప్రజలను అన్యాయంగా, ఏ తప్పు చేయకుండానే జైలుకు పంపే విధానం మున్ముందు కూడా కొనసాగుతుందా? అని నన్ను నేను ప్రశ్నించుకునేవాడిని' అన్నారు. "తదనంతరం, భారతదేశం స్వాతంత్ర్యం పొందింది, అయితే ఈ జైలుకు పంపే విధానం ఇప్పటికీ చాలా వరకు ఉనికిలో ఉంది" అని 88 ఏళ్ల ఆ ప్రముఖ ఆర్థికవేత్త తెలిపారు.
హిందు, ముస్లింల సహజీవనంలో చీలిక తెచ్చే ప్రయత్నం !
July 09, 2022
0
Tags