కంపెనీలు పరిహారం ఇవ్వాలి !

Telugu Lo Computer
0


ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ ఆలస్యమవ్వడం వల్ల ఏర్పడే నష్టానికి కంపెనీలు పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్‌కు చెందిన ఆరు కోట్ల మందికి పైగా సబ్‌స్క్రయిబర్లకు మేలు జరగనుంది. 20 లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేసే సంస్థలలో ఉద్యోగులకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ఇతర నిబంధనల చట్టం సామాజిక భద్రతను అందజేస్తుందని జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టియ్ అభయ్ ఎస్ ఓకాలతో కూడిన బెంచ్ తెలిపింది. ఈ చట్టం కింద, ఉద్యోగుల పీఎఫ్‌ను డిడక్ట్ చేసి, తప్పనిసరిగా ఆ మొత్తాన్ని ఈపీఎఫ్ ఆఫీసులో వారి తరఫున కంట్రిబ్యూట్ చేయాల్సివనసరం బాధ్యత కంపెనీలదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈపీఎఫ్‌లో కంపెనీలు ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ను క్రెడిట్ చేయడం ఆలస్యం చేస్తే.. ఈ చట్టానికి చెందిన సెక్షన్ 14బీ కింద పరిహారాలను చెల్లించాల్సి ఉంటుందని కర్నాటక హైకోర్టు తీర్పునిచ్చింది.


Post a Comment

0Comments

Post a Comment (0)