సాగు చట్టాల రద్దుకు లోక్ సభ ఆమోదం

Telugu Lo Computer
0


సాగు చట్టాలను కేంద్రం ఎట్టకేలకు వెనక్కి తీసుకుంది. ఈరోజు లోక్ సభ సమావేశాలు ప్రారంభం కాగా అందులో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశ పెట్టింది. ఉదయం సభ ప్రారంభం కాగానే రద్దు పై చర్చ జరగకుండా వాయిదా పడింది. అయితే రెండో సారి సభ ప్రారంభం కాగానే కేవలం 5 నిముషాల్లో మూజువాణి ఓటుతో బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. మధ్యాహ్నాం రెండు గంటలకు సభ తిరిగి సమావేశం అవుతుందని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. టీఆర్ఎస్ తో పాటు కొన్ని విపక్షాలు నిరసనలు తెలుపుతూ గ్యాలరీలోకి వెళ్లారు. అయితే అవేవీ పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)