హన్మకొండలోని పరిమళ కాలనీలో కొండచిలువ హల్ చల్ చేసింది. ఒక వ్యక్తి ఇంటి పరిసరాలలో ఆరు అడుగుల కొండచిలువ కనపడగా ఇంటిలో వారు హడలెత్తి పోయారు. జూ అధికారులకు కబురు పెట్టగా సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని కొండచిలువను బంధించారు. కొండచిలువను ములుగు అటవీ ప్రాంతంలో వదిలేస్తామని అధికారులు తెలిపారు.