.డీఎస్సీ-2008 అభ్యర్థులకు ప్రత్యేక రిక్రూట్మెంట్

Telugu Lo Computer
0


డీఎస్సీ 2008 అభ్య‌ర్థుల్లో 2,193 మంది అర్హులకు  సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ) పోస్టులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. వీరి కోసం ప్రత్యేక నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు చెప్పారు. మినిమమ్ టైం స్కేల్ విధానంలో పని చేయడానికి రాత పూర్వకంగా అంగీకారం తెలిపారన్నారు. 

ఏపీ డీఎస్సీ- 2008 అభ్య‌ర్థుల‌కు క‌నీస టైం స్కేల్ ఇస్తూ తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చేందుక ఆర్థిశాఖ ఆమోదించింది. అధికారంలోకి వ‌చ్చాక న‌వ‌ర‌త్నాల అమ‌లులో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దూసుకుపోతున్నారు. అతి త‌క్కువ కాలంలోనే అనేక ర‌కాల ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతూ త‌న మార్క్ పాలన అందిస్తున్నారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. డీఎస్సీ 2008 అభ్య‌ర్థుల‌కు ఊర‌ట‌నిచ్చేలా సీఎం జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

డీఎస్సీ-2008లో సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ) పోస్టులకు మొదట డీఈడీ వాళ్లకే అవకాశం కల్పించారు. దీనిపై బీఈడీ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా డీఈడీ వాళ్లకు 30శాతం పోస్టులే కేటాయించారు. దీంతో మొదట పోస్టులు వచ్చిన డీఈడీ అభ్యర్థులు పోస్టు కోల్పోవాల్సి వచ్చింది. ఈ అభ్యర్థుల వినతి మేరకు గత ప్రభుత్వం ఎమ్మెల్సీలతో కమిటీ వేసింది. కనీస వేతనంతో వీరికి పోస్టింగ్‌ ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. దీనికి ప్రస్తుతం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

డీఎస్సీ-2008కి సంబంధించిన అభ్యర్థులు మొత్తం 4,657 మంది ఉన్నట్లు లెక్క తేల్చారు. వీరిలో కొందరు ఇప్పటికే వేర్వేరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరికి పదవీ విరమణ వరకు కనీస టైం స్కేల్‌ ఇస్తూ పోస్టింగ్‌లు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

జూన్‌ నుంచి ఈ-ఎస్‌ఆర్‌

ఉపాధ్యాయుల ప్రస్తుత సర్వీసు రిజిస్టర్‌(ఎస్‌ఆర్‌) స్థానంలో ఈ-ఎస్‌ఆర్‌ తీసుకొస్తున్నారు. ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరినప్పటి నుంచి పదవీ విరమణ పొందిన వరకు అన్ని సేవలను ఆన్‌లైన్‌లోనే నమోదు చేయనున్నారు. జూన్‌ నుంచి దీన్ని అమల్లోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మానవవనరుల సేవలు, వేతనాల చెల్లింపులు, సర్వీసు మొత్తం ఆన్‌లైన్‌ చేయనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)