11-12వ తరగతుల పాఠ్యాంశాల్లో నైపుణ్య ఆధారిత (స్కిల్-బేస్డ్) లెర్నింగ్ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. ఈ కొత్త విద్యా విధానం ద్వారా విద్యార్థులకు ఉద్యోగాలకు అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలను అందించాలని, దేశ వృద్ధికి దోహదపడే మానవ వనరులను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళిక ప్రకారం, రాష్ట్రీయ విద్యా భవన్ ద్వారా 11వ, 12వ తరగతుల సిలబస్లో స్కిల్ ఆధారిత మాడ్యూల్స్ను చేర్చనున్నారు. ఇందులో ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, హెల్త్కేర్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి ఆధునిక రంగాల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. 'విద్యార్థులు పుస్తకాలతో మాత్రమే పరిమితం కాకుండా, రియల్-వరల్డ్ స్కిల్స్తో సిద్ధమవ్వాలి.. ఇది భారత్ను గ్లోబల్ స్కిల్ హబ్గా మార్చుతుంది' అని కేంద్ర విద్యా శాఖ, నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ చర్య భారత్లో 50శాతం కంటే ఎక్కువ మంది యువతకు ఉద్యోగాలు అందించడం, స్కిల్ ఇండియా మిషన్కు అనుగుణంగా పనిచేయడం వంటి లక్ష్యాలను సాధించడానికి దోహదపడుతుందని అధికారులు అంటున్నారు. 2026-27 అకడమిక్ ఇయర్ నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయని, రాష్ట్రాలతో కలిసి పైలట్ ప్రాజెక్ట్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
11-12 తరగతుల్లోస్కిల్-బేస్డ్ లెర్నింగ్ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక
September 21, 2025
0
Tags