బ్రిటన్ లో ఇండియా గ్లోబల్ ఫోరమ్ (ఐజిఎఫ్) ఆధ్వర్యంలో 'ఐజిఎఫ్ లండన్ 2025' కార్యక్రమం ప్రారంభమైంది. జూన్ 18న ప్రారంభమైన ఈ సమావేశం శుక్రవారం వరకు కొనసాగుతుంది. ఈ సదస్సులో యుకె వ్యాపార, వాణిజ్య కార్యదర్శి జొనాథన్ రెనాల్డ్స్, పీయూష్ గోయల్తో కలిసి కీలక చర్చలు జరుపుతారు. దీని ద్వారా ఉన్నత స్థాయి చర్చలకు వేదిక కానుంది. ఈ సందర్భంగా ఇండియా గ్లోబల్ ఫోరమ్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు మనోజ్ లాడ్వా మాట్లాడుతూ, "యుకె-భారత సంబంధాలు ఈ ఒప్పందం ద్వారా ఒక కొత్త శకానికి నాంది పలుకుతాయి. ఈ ఒప్పందాన్ని వేగంగా అమలు చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అభివృద్ధికి, ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది. మా భాగస్వామ్యం ద్వారా వాణిజ్య శక్తి, ఆలోచనలు మిళితమవుతాయి" అని అన్నారు. యుకె, భారత్ ఒప్పందం కొత్త ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, వ్యూహాత్మక దృక్పథం, వాణిజ్యం, ఆవిష్కరణలు, దౌత్యపరమైన అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రపంచ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. మూడు రోజులపాటు జరిగే ఈ గ్లోబల్ సదస్సును సిఐఐ, ఇండియా గ్లోబల్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీని ద్వారా యుకెలో భారతీయ వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని, పెట్టుబడులు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ సదస్సు ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడి, ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఐజిఎఫ్ లండన్ 2025 సదస్సు ప్రారంభం
June 19, 2025
0
Tags