సరస్వతి విహార్ హింస కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ను దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్ హత్య కేసులో ప్రత్యేక న్యాయమూర్తి కావేరి ఈ తీర్పు వెలువరించారు. సజ్జన్ కుమార్ వయసు దాదాపు 80 సంవత్సరాలు ఉంటుంది. సజ్జన్ కుమార్ కు ఇది రెండోసారి జీవిత ఖైదు. ఇప్పటికే ఢిల్లీ కాంట్ కేసులో సజ్జన్ కుమార్ జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. 1984 నవంబర్ 1న ఢిల్లీలోని సరస్వతి విహార్ ప్రాంతంలో ఇద్దరు సిక్కులు జస్వంత్ సింగ్, అతని కుమారుడు తరుణ్దీప్ సింగ్ దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఉత్తర ఢిల్లీలోని సరస్వతి విహార్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. రంగనాథ్ మిశ్రా కమిషన్ ముందు ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగా ఈ ఫిర్యాదు దాఖలైంది.
సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు విధించిన ఢిల్లీ కోర్టు !
February 25, 2025
0
Tags