మెరుగైన పనితీరు ప్రదర్శించని ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్‌ తొలగింపు వేటు !

Telugu Lo Computer
0


మెరుగైన పనితీరు ప్రదర్శించని ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్‌ తొలగింపు వేటు వేసింది. బిజినెస్ ఇన్‌సైడర్ పత్రికలో పేర్కొన్న కథనం ప్రకారం యూఎస్‌లో కొందరు ఉద్యోగులను వారి పనితీరు ఆధారంగా మైక్రోసాఫ్ట్ తొలగించడం ప్రారంభించింది. తాజాగా తొలగింపులకు గురైన ఉద్యోగులకు మెడికల్, ప్రిస్క్రిప్షన్, డెంటల్ హెల్త్‌కేర్ ప్రయోజనాలు తక్షణమే ముగుస్తాయని కంపెనీ తొలగింపు లేఖల్లో పేర్కొన్నట్లుగా ఇన్‌సైడర్ కథనంలో ఉదహరించింది. ముగ్గురు ఉద్యోగులకైతే తొలగింపు పరిహారాన్ని కూడా చెల్లించలేదని పేర్కొంది. "మీ పనితీరు కనీస ప్రమాణాలను, అంచనాలను అందుకోలేకపోవడమే మీ తొలగింపునకు కారణం" అని తొలగింపు లేఖల్లో కంపెనీ పేర్కొంది. "మీరు తక్షణమే అన్ని విధుల నుండి వైదొలుగుతున్నారు. మైక్రోసాఫ్ట్ సిస్టమ్‌లు, ఖాతాలు, కార్యాలయాలకు యాక్సెస్‌ను ఈరోజు నుంచే తొగిస్తున్నాం. ఇక మైక్రోసాఫ్ట్‌ తరఫున మీరు ఇటువంటి పని చేయలేరు" అని వివరించింది. తొలగింపునకు గురైన ఉద్యోగి భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్‌లో మరో కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు కంపెనీలో సదరు ఉద్యోగి గత పనితీరు, తొలగింపునకు గురైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కూడా ఆ లేఖల్లో పేర్కొన్నారు. గతేడాది జూన్ చివరి నాటికి మైక్రోసాఫ్ట్‌ సంస్థలో దాదాపు 2,28,000 మంది ఫుల్‌ టైమ్‌ ఉద్యోగులు ఉన్నారు. ఇవే కాదు.. మైక్రోసాఫ్ట్ ఇటీవల సెక్యూరిటీ, ఎక్స్‌పీరియన్స్‌ అండ్‌ డివైజెస్‌, సేల్స్‌, గేమింగ్‌లో విభాగాల్లోనూ పలువురు ఉద్యోగులను తొలగించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)