పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, కుమార్తులి ఘాట్ సమీపంలో ఇద్దరు మహిళలు టాక్సీ నుండి బరువైన ట్రాలీ బ్యాగును దించుతున్నట్లు స్థానికులు చూశారు. ట్రాలీ బ్యాగును చూసిన స్థానిక మహిళలు అనుమానం వచ్చి ఇద్దరు మహిళలను ప్రశ్నించడం ప్రారంభించారు. అప్పుడు ఆ ఇద్దరు మహిళలు ట్రాలీ బ్యాగులో కుక్క శవం ఉందని చెప్పారు. కానీ స్థానికులు దానిని అంగీకరించడానికి ఇష్టపడలేదు. వారు బ్యాగ్ తెరిచి చూడగా, అందులో ఒక మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా ఉన్నట్లు కనుగొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరు మహిళలను అరెస్టు చేసి, ట్రాలీ బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీ బ్యాగులో లభ్యమైన మృతురాలి పేరు సుమితా ఘోష్ అని పోలీసులు తెలిపారు. అరెస్టయిన ఇద్దరు మహిళలు ఫల్గుణి ఘోష్, ఆర్తి ఘోష్ గా చెప్పారు. ఇద్దరూ తల్లీకూతుళ్లు.. అయితే మరణించిన సుమితా దేవి, ఫల్గుణీ దేవి అత్త అని పోలీసులు తెలిపారు. వీరు మధ్యగ్రామ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్నారని తెలిపారు. ఆ మహిళ ఎలా హత్యకు గురైందో తెలుసుకోవడానికి పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదించారు. ఆ మహిళను ఎందుకు హత్య చేశారో తెలుసుకోవడానికి నార్త్ పోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారులు అరెస్టు చేసిన వారిని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ హత్య జరిగిఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. శరీర భాగాలను శవపరీక్ష కోసం పంపారు. శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాత మరణానికి కారణం స్పష్టంగా తెలుస్తుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ట్రాలీ బ్యాగు తెరచి చూడగా మహిళ మృతదేహం ముక్కలు !
February 26, 2025
0
Tags