చెన్నై నగరంలో నడుపనున్న తొలి 'ఏసీ' సబర్బన్ రైలు ట్రయల్ రన్ మంగళవారం నిర్వహించారు. చెన్నై బీచ్-చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ రైలు మార్గంలో 'ఏసీ' సబర్బన్ రైలు నడపాలని దక్షిణ రైల్వే 2019లో రైల్వే బోర్డుకు విజ్ఞప్తి చేసింది. దాని ప్రకారం, దక్షిణ రైల్వే చెన్నై డివిజన్కు రెండు ఏసీ సబర్బన్ రైళ్లు తయారుచేయాలని ఐసిఎఫ్కు రైల్వే బోర్డు ఆదేశించింది. ప్రస్తుతం ఏసీ సబర్బన్ రైలు తయారవడంతో, మంగళవారం ఐసిఎఫ్ ప్రాంగణంలో ట్రయల్ రన్ నిర్వహించారు. 12 బోగీలతో కూడిన ఈ రైలులోని భద్రతా అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ రైలును త్వరలో దక్షిణ చెన్నై డివిజన్ అధికారులకు అప్పగించనున్నారు. అనంతరం ఎక్స్ప్రెస్ రైలు మార్గంలో 110 కి.మీ వేగంతో ఈ రైలు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. మరో రెండు నెలల్లో ఏసీ సబర్బన్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
చెన్నై నగరంలో నడుపనున్న తొలి 'ఏసీ' సబర్బన్ రైలు ట్రయల్ రన్
January 23, 2025
0
Tags