టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల 2G వినియోగదారుల కోసం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మార్పులు ఆపరేటర్ల ద్వారా సరసమైన రీఛార్జ్ ప్లాన్లను ప్రారంభించడం కోసం అవసరమైన శాశ్వత మార్పులను అందిస్తాయి. ప్రస్తుతం ముఖ్యంగా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలపై ఆధారపడే వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ రీచార్జ్ వినియోగంలో అధిక ధరలను చెల్లించాల్సి వస్తుంది. ఈ వినియోగదారులు తరచూ 3G లేదా 4G డేటా అవసరం లేకున్నా కూడా ఆర్థికంగా ఎక్కువ ధర ప్లాన్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో ఈ సమస్యల పరిష్కారం కోసం TRAI డిసెంబర్ 24, 2024న ఈ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. వీరి కోసం కొత్త ప్లాన్లలను అమలు చేయాలని టెలికాం సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. కానీ ఆయా సంస్థలు ఇంకా ఈ మార్పులను అమలు చేయలేదు. ఈ క్రమంలో జనవరి చివరి వారం నుంచి ఈ మార్పులు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ట్రాయ్ చేసిన మార్పులలో ముఖ్యమైనదేంటంటే 2G వినియోగదారులకు రూ. 10 నుంచి ప్రారంభమయ్యే రీఛార్జ్ ప్లాన్లను అందించాలి. దీంతో టెలికాం ఆపరేటర్లు తమ సొంత నిర్ణయం ప్రకారం టాప్ అప్ వోచర్లను జారీ చేయాలి. వాటి ధర వినియోగదారులకు అనుకూలంగా ఉండాలి. ఆన్లైన్ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని TRAI ఫిజికల్ రీఛార్జ్ సిస్టమ్ను తొలగించాలని నిర్ణయించింది. దీంతో వినియోగదారులు రీఛార్జ్ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న స్పెషల్ టారిఫ్ వోచర్ లో మరో కీలకమైన మార్పు జరిగింది. మునుపటి 90 రోజుల చెల్లుబాటును ఇప్పుడు 365 రోజులకు పొడిగించింది. దీని ద్వారా వినియోగదారులు ఒక సంవత్సరపాటు అంగీకరించే ప్లాన్ను ఉపయోగించుకోవచ్చు. ఇది దీర్ఘకాలిక కేటాయించిన సేవలు అవసరమయ్యే వినియోగదారుల కోసం ఉద్దేశించినది. అలాగే ఈ మార్పు 2G వినియోగదారులకు ప్రత్యేకంగా ఉంటుంది. డేటా కోసం చెల్లించే అవసరం లేకుండా కేవలం వాయిస్, SMS సేవలను అందించడానికి మాత్రమే ఉద్దేశించబడింది. ట్రాయ్ మార్గదర్శకాలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. కానీ టెలికాం కంపెనీలు ఈ మార్పులను అమలు చేయడానికి కొన్ని వారాలు పట్టే అవకాశం ఉంది. 2025 జనవరి చివరి నాటికి ఈ సరసమైన రీఛార్జ్ ప్లాన్లు మార్కెట్లోకి రానున్నాయి.
2G వినియోగదారులకు 10 రూపాయల రీఛార్జ్ !
January 15, 2025
0
Tags