సైనిక డ్రోన్‌ గురితప్పి 120 మంది పౌరుల మృతి!

Telugu Lo Computer
0


నైజీరియాలో రెబల్స్‌పైకి సైన్యం ప్రయోగించిన ఒక డ్రోన్‌ గురి తప్పి పౌరులపై పడింది. ఈ ఘటనలో 120 మంది మరణించినట్లు తెలుస్తోంది. కదూనా రాష్ట్రంలోని ఇగాబీలో ఆదివారం రాత్రి ఒక మత ఉత్సవం చేసుకుంటున్న వారిపై ఆకస్మాత్తుగా డ్రోన్‌ బాంబు పడింది. సెలవు దినం కావడంతో ఉత్సవానికి భారీగా జనం వచ్చారు. దీంతో ప్రాణ నష్టం అధికంగా జరిగింది. ఇటీవల సైన్యం ప్రయోగించిన డ్రోన్లు గురి తప్పి తరచూ జనవాసాలపై పడుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)