ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో దెందులూరు మండల పరిధిలో 10వ తరగతి చదువుతున్న బాలికపై వాలంటీర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆధార్ కార్డులు కావాలంటూ వాలంటీర్ నీలాపు శివకుమార్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తరచూ తమ ఇంటికి వస్తుండడాన్ని గమనించి తల్లిదండ్రులు బాలికన నిలదీయడంతో అసలు విషయం వెలుగు చూసినట్టు తెలుస్తోంది. ఆధార్ కార్డు కావాలంటూ వచ్చి తనను లోబర్చుకున్నట్టు బాలిక తల్లిదండ్రుల దగ్గర వాయిపోయింది. దీంతో వాలంటీర్ నీలాపు శివకుమార్ పై బాధితురాలి తల్లిదండ్రులు దెందులూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బాలికపై వాలంటీర్ అత్యాచారం !
October 18, 2023
0
Tags