గుజరాత్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని నగరాలు, గ్రామాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. చాలా ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. అయితే ఈ అధిక వర్షాపాతం కారణంగా రాష్ట్రంలో 9 మంది మృతి చెందినట్లు శనివారం గుజరాత్ ప్రభుత్వ యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం సహా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు కచ్, జామ్నగర్, జునాగఢ్, నవ్సారి తీవ్రంగా ప్రభావితమైన జిల్లాలలో కొన్నింటిని మోహరించి సహాయక చర్యలు చేస్తున్నట్లు అధికారి తెలిపారు. రాష్ట్రంలోని 37 తాలూకాల్లో 30 గంటల పాటు 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందట. శుక్రవారం అర్థరాత్రి మొదలైన వర్షం.. శనివారం ఉదయం 6 గంటలకు ముగిసింది. జునాగఢ్ జిల్లాలోని విసావదర్ తాలూకాలో అత్యధికంగా 398 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. https://t.me/offerbazaramzon
గుజరాత్ లో భారీ వర్షాలు !
July 01, 2023
0
Tags