ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఆదాయపు పన్ను శాఖలో రూ.500 కోట్లకు పై మొత్తంలో రీఫండ్ కుంభకోణం జరిగిందని గుర్తించిన అధికారులు, తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఐటీశాఖ నుంచి పలువురు రీఫండ్ పొందినట్లుగా వెలుగులోకి తెచ్చారు. ఈ స్కామ్లో చార్టెడ్ అకౌంటెంట్లు కీలకంగా వ్యవహరించారని ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు భారీగా లబ్ధి పొందినట్లు అనుమానిస్తున్నారు. ఇంకా వందల మందిని ఐటీ ఆఫీస్కి పిలిచి మరీ విచారించారు అధికారులు. హైదరాబాద్లో 8 ప్రాంతాలతోపాటు.. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, అమలాపురం, తిరుపతి, గుంటూరు ప్రాంతాల్లో సోదాలు చేశారు. ట్యాక్స్ రీఫండ్ పేరుతో కోట్లలో స్వాహా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. ఆదాయపు పన్ను శాఖలో భారీగా నిధులు స్వాహా చేసినట్లు ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. https://t.me/offerbazaramzon
రిఫండ్ పేరుతో రూ. 500 కోట్లకు పైగా కుంభకోణం !
July 01, 2023
0
Tags