డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

Telugu Lo Computer
0


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. కారులో వచ్చి డ్రగ్స్ విక్రయిస్తుండగాఎస్ ఓటీ పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పాతబస్తీకి చెందిన మహ్మద్ హమీద్ గా గుర్తించారు. అతని వద్ద నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)