షేక్‌ హసీనా రాజీనామాకు భారీ ర్యాలీ

Telugu Lo Computer
0


బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామాను డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షం బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ (బీఎన్పీ)కి చెందిన వేలాది కార్యకర్తలు శనివారం ఢాకాలో మహా ర్యాలీ నిర్వహించారు. 2023 డిసెంబరులో జరిగే బంగ్లా పార్లమెంటు ఎన్నికలకు ముందే హసీనా రాజీనామా చేసి ఆపద్ధర్మ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించాలన్నది వారి ప్రధాన డిమాండ్‌. ర్యాలీ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 20,000 మంది పోలీసులు మోహరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)