లక్షా 25 వేల కోట్ల పెట్టుబడులను సమకూర్చాం !

Telugu Lo Computer
0


లక్షా 25 వేల కోట్ల రూపాయలతో పెద్ద కంపెనీలు అరవిందో, అదాని, గ్రీన్ కో వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు ముఖ్యమంత్రి సమక్షంలో చేసుకున్నాము. స్టీల్ సంబంధించి లక్ష్మీ మిట్టల్ వారసుడైన వర్షల్ మిట్టల్ తో వెయ్యి కోట్లు అదనంగా పెంచాలని కోరామని, రానున్న రోజుల్లో ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. దావోస్ పర్యటన ముగించుకొని ఈరోజు మధ్యాహ్నం విశాఖపట్నం విమానాశ్రయం చేరుకున్నారు.ఈ సందర్భంగా విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి మూడు సంవత్సరాలు గడిచిన సందర్భంగా సమక్షంలో కేక్ కట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)