ఐసీసీ మహిళా వరల్డ్‌కప్‌ టోర్నీ నుంచి భారత్‌ అవుట్‌

Telugu Lo Computer
0


న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్‌-2022 టోర్నీలో భారత్‌కు భంగపాటు తప్పలేదు. సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మిథాలీ సేనకు నిరాశే ఎదురైంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం దక్షిణాఫ్రికానే వరించింది. మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది. దీంతో భారత మహిళా జట్టు సెమీస్‌ ఆశలు గల్లంతయ్యాయి. చివరి వరకు పోరాడిన మిథాలీ సేన పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)