అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి, గంటకు 12 కి.మీ. వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. భారత వాతావరణ శాఖ ప్రకారం, ఇది రానున్న కొన్ని గంటల్లో తుఫానుగా, ఆ తర్వాత 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. 'శక్తి' తుఫాను ప్రభావం గుజరాత్, గోవా, మహారాష్ట్ర తీర ప్రాంతాలపై తీవ్రంగా ఉంటుందని, ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. ప్రపంచ వాతావరణ సంస్థ ఆదేశాల ప్రకారం, హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలోని 13 దేశాలు తుఫాన్లకు పేర్లు నిర్ణయిస్తాయి. ఈసారి ఈ తుఫానుకు శ్రీలంక ఈ పేరును పెట్టింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. అయినప్పటికీ, ముందస్తు జాగ్రత్తగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. వాతావరణ శాఖ తుఫాను కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన హెచ్చరికలు జారీ చేస్తోంది.
అరేబియా సముద్రంలో 'శక్తి' తుఫాన్ : హై అలర్ట్ ప్రకటించిన భారత వాతావరణ శాఖ
October 04, 2025
0
Tags