సెప్టెంబర్ నెలలో ₹1.89 లక్షల కోట్లు జీఎస్టీ వసూలు

Telugu Lo Computer
0


సెప్టెంబర్ నెలలో జీఎస్టీ  ₹1.89 లక్షల కోట్లు వసూలు అయింది. గతేడాది సెప్టెంబర్ లో ₹1.73 లక్షల కోట్లు ఉండగా, ఈ ఏడాదికి 9.1% పెరిగి రూ.1.89 లక్షల కోట్లకు చేరుకున్నాయి. జీఎస్టీ వసూళ్లు ₹1.80 లక్షల కోట్లను దాటడం ఇది వరుసగా తొమ్మిదవ నెల. ఆగస్టులో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.86 లక్షల కోట్లుగా ఉంది. ఆగస్టు 2024లో రూ.1.75 లక్షల కోట్లు ఉండగా, 6.5% వృద్ధిని సాధించింది. ఆగస్టులో నికర వసూళ్లు 10.7% పెరిగి రూ.1.67 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అయితే.. జూలైలో ఆ నెలలో అధిక వాపసుల కారణంగా నికర ఆదాయాలు రూ.1.68 లక్షల కోట్లకు తగ్గాయి. ఏప్రిల్-ఆగస్టు కాలంలో GST ఆదాయం మొత్తం రూ.10.04 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.9.13 లక్షల కోట్లుగా ఉండింది. జీఎస్టీ వసూళ్లలో పెరుగుదల ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయని సూచిస్తుంది. ప్రభుత్వ ఆదాయాలు కూడా పెరుగుతున్నాయి. అయితే జీఎస్టీ  సంస్కరణల ప్రభావం క్రమంగా కనబడుతోంది. ఈ సంస్కరణ వల్ల రాబోయే నెలల్లో జీఎస్టీ వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. జీఎస్టీ సంస్కరణలు దేశీయ డిమాండ్‌ను పెంచుతాయని, దీంతో జీడీపీ వృద్ధికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను 6.5% నుంచి 6.8%కి పెంచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)