రైలులో సిగరెట్ కాల్చిన మహిళ : అభ్యంతరం తెలిపిన తోటి ప్రయాణికులపై ఆమె ఎదురుదాడి !

Telugu Lo Computer
0


గాంధీధామ్-విశాఖపట్నం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ లోని ఏసీ కంపార్ట్‌మెంట్‌లో ఒక మహిళ సిగరెట్ కాల్చడం వివాదంగా మారింది. దీనికి  సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. గాంధీధామ్-విశాఖపట్నం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏసీ కంపార్ట్‌మెంట్‌లో ఒక మహిళ సిగరెట్ కాల్చింది. దీనిపై అభ్యంతరం తెలిపిన తోటి ప్రయాణికులపై ఆమె ఎదురుదాడి చేసింది. రైలు నంబర్ 20804లో జరిగిన ఈ ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలులో సిగరెట్ కాల్చడం చట్టవిరుద్ధం. దీనిపై రైల్వే పోలీసులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)