తెలంగాణ రాష్ట్ర కమిటీని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఎనిమిది మంది రాష్ట్ర ఉపాధ్యక్షులతో కమిటీ ఏర్పాటైంది. జనరల్ సెక్రటరీలుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్ను నియమించినట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు తెలిపారు. ఉపాధ్యక్షులుగా బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, బండారి శాంతికుమార్, బండ కార్తీకారెడ్డి ఎన్నికయ్యారు. సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ ట్రెజరర్, చీఫ్ స్పోక్స్ పర్సన్, ఏడు మోర్చాలను అధిష్ఠానం ప్రకటించింది. కార్యదర్శులుగా ఓఎస్ రెడ్డి, కొప్పు భాష, భరత్ ప్రసాద్, బండారు విజయలక్ష్మి, స్రవంతి రెడ్డి, కరణం పరిణిత, బద్దం మహిపాల్ రెడ్డి, తూటుపల్లి రవికుమార్. కోశాధికారిగా దేవకీ వాసుదేవ్, జాయింట్ ట్రెజరర్ గా విజయ్ సురానా జైన్, చీఫ్ స్పోక్స్ పర్సన్ గా ఎన్వీ సుభాష్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు: మేకల శిల్పారెడ్డి, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు: గణేశ్ కుండె, కిసాన్ మోర్చా: బస్వాపురం లక్ష్మీనర్సయ్య, ఎస్సీ మోర్చా: కాంతికిరణ్, ఎస్టీ మోర్చా: నేనావత్ రవినాయక్, ఓబీసీ మోర్చా: గంధమల్ల ఆనంద్ గౌడ్, మైనార్టీ మోర్చా: సర్దార జగన్మోహన్ సింగ్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించిన అధిష్ఠానం
September 08, 2025
0
Tags