ఉత్తర ప్రదేశ్ మీరట్ సివిల్ లైన్స్ పీఎస్ పరిధిలో ఉన్న ఎండీఏ కార్యాలయం ఎదుట భర్తను కొడుతుంది భార్య. అసలు ఎందుకు కొడుతుందో తెలియకుండా భార్య భర్తను పిడిగుద్దులు గుద్ది, కొరికి, బూతులు తిడుతూ అరగంట సేపు రచ్చరచ్చ చేసింది. అక్కడున్న స్థానికులు కొందరు ఆపేందుకు ప్రయత్నించినా ఆ మహిళ తన ఉగ్ర రూపాన్ని ప్రదర్శించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఇద్దరిని పీఎస్ కు తరలించారు. అసలు గొడవేంటే ఆ మహిళ భర్తపై ఎందుకలా దాడి చేసిందో అర్థం కావడంలేదు. రోడ్డు మీద అందరూ చూస్తున్నారని లేకుండా అతడిపై దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
భర్తను రోడ్డు మీద పిడిగుద్దులు గుద్ది, కొరికి రచ్చరచ్చ చేసిన భార్య : వీడియో సోషల్ మీడియాలో వైరల్
September 18, 2025
0
Tags