ఆంధ్రప్రదేశ్ లోని స్కూళ్లకు దసరా సెలవులను సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఇవ్వనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22వ తేదీ నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని తన దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి సెలవులపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీని ప్రకారం దసరా పండుగకు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో దసరా పండుగకు 12 రోజులు రానున్నాయి. కాగా, అంతకు ముందు స్కూళ్లకు దసరా పండుగ సెలవులను సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మొత్తం 9 రోజులు ప్రకటించారు. అయితే, దీనిపై పునరాలోచించాలని ఉపాధ్యాయులు ప్రభుత్వా్నికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి.. మరో 3 రోజులు పెంచుతూ 9 రోజుల సెలవులను కాస్తా 12 రోజులుగా ప్రకటించింది.
స్కూళ్లకు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు
September 19, 2025
0
Tags