ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై 'హరిహర వీరమల్లు' సినిమా ప్రమోషన్ల కోసం ప్రభుత్వ నిధులను ఉపయోగించారని ఆరోపిస్తూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని, నిధుల దుర్వినియోగం జరిగిందా లేదా అనేది సమగ్రంగా బయటపడాలని విజయ్ కుమార్ పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే అవసరమైతే ఏసీబీ దర్యాప్తు కూడా జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్పై ప్రాథమిక విచారణ జరిపిన హైకోర్టు, కేసు విచారణ జాబితాలో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్
August 19, 2025
0
Tags