విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో స్నానానికి దిగి ఒకరు మృతి, మరొకరు గల్లంతు

Telugu Lo Computer
0


విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో స్నానానికి దిగి ఒకరు మృతి చెందగా, ఒకరు క్షేమంగా బయపడ్డారు. మరొకరు గల్లంతయ్యారు. మునిగిపోతున్న మహిళను కాపాడడానికి వెళ్లిన ఒడిశాకు చెందిన 22 ఏళ్ల యువకుడు గల్లంతయ్యాడు. అతని కోసం సహాయక బృందాలు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టాయి. బీచ్‌ చూసేందుకు హైదరాబాద్‌ నుంచి వచ్చిన దంపతులు సరదాగా బీచ్‌లోకి దిగగా కెరటాల ఉధృతికి మహిళ (50) కొట్టుకుపోయింది. భార్య మృతి చెందగా, భర్తను స్థానికులు కాపాడారు. దంపతులను కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తి మృతి చెందాడు.


Post a Comment

0Comments

Post a Comment (0)