ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పెన్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. జులై నెలలో 62.81 లక్షల మంది పెన్షన్లు పొందగా, ఆగస్టు నెలలో ఈ సంఖ్య 63.71 లక్షలకు పెరిగింది. అంటే 89,567 మందికి అదనంగా పెన్షన్ లభించింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం - పెన్షన్ పొందుతున్న వారు మరణించాక, వారి భార్యలకు వితంతు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం తీసుకుంది. ఆగస్టు నెలలో మొత్తం 1,09,155 మందికి వితంతు పెన్షన్లు మంజూరయ్యాయి. గత ప్రభుత్వం హయాంలో అనర్హుల పేర్లను తొలగించిన తర్వాత ఇప్పుడు మళ్లీ అర్హుల జాబితా పెరుగుతోంది. వృద్ధులు మరణించిన తర్వాత, వారి భార్యలు వార్డు/గ్రామ సచివాలయానికి వెళ్లి, మరణ ధృవీకరణ పత్రంతోపాటు అవసరమైన పత్రాలు సమర్పించి వితంతు పెన్షన్ కోసం అప్లై చేయవచ్చు. ప్రతి నెలా సీఎం చంద్రబాబు స్వయంగా గ్రామాలకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. ప్రజలతో నేతల మధ్య సంబంధాన్ని పెంచేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ విధ్వంసం చేసిందని, పలు కేంద్ర పథకాలను నిలిపివేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. 'తల్లికి వందనం', 'అన్నదాత సుఖీభవ' వంటి పథకాలను తీసుకొచ్చి గుడ్విల్ పెంచుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం కొత్తగా పెన్షన్లను ప్రకటించలేదు. సంవత్సరమైపోయినా కొత్త అర్హులు జాబితాలో చేరలేదు. ఇది కొంత అసంతృప్తికి కారణమవుతోంది. కానీ పాలన స్థిరంగా సాగుతున్నందున త్వరలోనే కొత్త పెన్షన్లు ప్రకటిస్తారని ఆశిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో గణనీయంగా పెరిగిన పెన్షన్ల సంఖ్య
August 01, 2025
0
Tags