రైలు నుంచి ప్రయాణికుడిని తోసేసిన ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌

Telugu Lo Computer
0


ఎక్స్‌ ఖాతాలో షేర్ చేయబడిన మీడియోలో ఓ యువకుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ గుర్తించారు. అయితే ప్రయాణికుడికి జరిమానా విధించడం లేదంటే తదుపరి స్టేషన్‌లో అతన్ని రైలు నుంచి దించేయడం వంటివి చేయాలి. వీటికి బదులుగా ఆ అధికారి అతన్ని రైలు నుంచి బలవంతంగా బయటకు తోసెయ్యడం వీడియోలో కనిపిస్తుంది. అదే ట్రైన్‌లో ఉన్న ఇతర ప్రయాణీకులు ఆ అధికారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. పైగా అడిగిన వారిపై కూడా ఆర్‌పీఎఫ్‌ అధికారి కన్నెర్ర చేశాడు. ఓ ప్రయాణికుడు రహస్యంగా ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎక్కడ జరిగిందో తెలియదుగానీ. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై వేలాది మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. టికెట్ లేకుండా ఆ యువకుడు ప్రయాణిస్తుంటే, అతనికి జరిమానా విధించాలి. లేదా తదుపరి స్టేషన్‌లో అతన్ని దించేయాలి. అంతేకానీ అతన్ని కదులుతున్న రైలు నుంచి బయటకు తోసేయడం ఏంటి? యూనిఫాం ధరించడం వల్ల మీరు దేవుడిగా మారారా? అంటూ ఓ యూజర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న సదరు RPF అధికారిపై రైల్వే మంత్రిత్వ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోపై స్పందించిన ఢిల్లీలోని ఆర్‌పీఎఫ్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వీడియోలో కనిపించిన కానిస్టేబుల్‌ను దయా బస్తీలోని ఆర్‌పీఎఫ్‌ రిజర్వ్ లైన్‌కు తరలించామని, డివిజనల్ స్థాయి విచారణ జరుగుతోందని వివరణ ఇచ్చింది. ఈ సంఘటన ఆగస్టు 18, 2025న ఢిల్లీ సారాయ్ రోహిల్లా స్టేషన్‌లో జరిగిందని తెలిపింది. వీడియోలోని యువకుడు నెంబర్‌ 22482 ఉన్న రైలు అలారం గొలుసు లాగడంతో ఆగిపోయిందని, ఆర్‌పీఎఫ్‌ అధికారికి సరైన గుర్తింపు వివరాలను అందించకపోవడంతో ఆ వ్యక్తిని రైలు నుంచి బయటకుతోసే ప్రయత్నం చేశాడని ఆర్‌పీఎఫ్‌ పేర్కొంది. సంఘటన సమయంలో రైలు ప్లాట్‌ఫారమ్ వద్ద నిలబడి ఉందని, కదులుతున్న రైలు నుంచి ప్రయాణీకుడిని తోసివేశారనేది తప్పుడుడు ఆరోపణ అని స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)