ప్రాణం తీసిన రీల్స్‌ పిచ్చి : నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు

Telugu Lo Computer
0


డిశాలోని కోరాపూర్‌ జిల్లాలోని దుడుమా వాటర్‌ ఫాల్‌ని తన కెమెరాలో బంధించి రీల్స్‌గా పెడదామనుకున్న యువకుడు కనిపించకుండా పోయాడు. డ్రోన్‌ సాయంతో ఆ వాటర్‌ ఫాల్‌ను బంధించే క్రమంలో గంజామ్‌ జిల్లా బెర్హాంపూర్‌కు చెందిన సాగర్‌ టుడు అనే 22 ఏళ్ల యువకుడు ఆ నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేపట్టింది రెస్క్యూ బృందం. సాగర్‌ టుడే అనే యువకుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆ స్పాట్‌కు వచ్చాడు. రెగ్యులర్‌గా పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తూ తన యూట్యూబ్‌ చానల్స్‌లో పోస్ట్‌ చేసే సాగర్‌.. డ్రోన్‌ కెమెరాతో ఆ వాటర్‌ ఫాల్‌ను కెమెరాలో తీస్తున్నాడు. కోరాపుట్‌లోని లామ్టాపుట్ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మచకుండ ఆనకట్ట అధికారులు ఆనకట్ట దిగువన నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేసిన తర్వాత నీటిని విడుదల చేశారు. అయితే ఆ సమయంలో సాగర్‌ ఒక బండరాయిపై నిలబడి డ్రోన్‌ను నియంత్రిస్తున్నాడు. నీటి ఉధృతి ఎక్కువ కావడంతో బండారాయిపై ఉన్న అతను నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అయితే అతని కోసం స్థానికుల సాయంతో రెస్క్యూ బృందం చర్యలు చేపట్టినా ఆచూకీ మాత్రం లభించలేదని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)