ఢిల్లీ నుంచి ఇండోర్‌కు వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి మళ్లింపు

Telugu Lo Computer
0


ఢిల్లీ నుంచి ఇండోర్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి వచ్చింది. విమానపు కుడి ఇంజిన్‌లో అగ్నిప్రమాద సూచన అందుకున్న దరిమిలా పైలట్‌ విమానాన్ని ఢిల్లీకి మళ్లించినట్లు ఎయిర్‌ ఇండియా తెలిపింది. ఢిల్లీకి తిరిగి వచ్చిన విమానాన్ని తనిఖీల కోసం నిలిపివేశామని, ప్రయాణికులను ఇండోర్‌కు ప్రత్యామ్నాయ విమానంలో తరలించామని ఎయిర్‌ ఇండియా అధికారులు తెలిపారు. కాక్‌పిట్ సిబ్బందికి ఇంజిన్‌లో మంటలు వస్తున్నట్లు సూచన అందింది. ప్రామాణిక విధానాన్ని అనుసరించి కాక్‌పిట్ సిబ్బంది ఇంజిన్‌ను ఆపివేయాలని నిర్ణయించుకుని, ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఢిల్లీలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానాన్ని తనిఖీల కోసం నిలిపివేశారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలోకి తరలిస్తున్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా ప్రధాన ప్రాధాన్యత' అని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)