కసబ్ కేసు ప్రాసిక్యూటర్ ఉజ్వల్నిగమ్తో పాటు సదానందన్, హర్షవర్ధన్, మీనాక్షిజైన్ లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(a) ద్వారా సంక్రమించిన అధికారాల మేరకు వీరిని నామినేట్ చేశారు. సాహిత్యం, సైన్స్, కళలు,సామాజిక సేవ వంటి రంగాలలో సేవలు అందించిన ప్రముఖ వ్యక్తులను గుర్తించి రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేయడానికి రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. గతంలో నామినేట్ అయిన సభ్యుల పదవీ విరమణ కారణంగా సీట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో కొత్త సభ్యులను నామినేట్ చేశారు.
రాజ్యసభ సభ్యులుగా ఉజ్వల్ నిగమ్, సదానందన్, హర్షవర్ధన్, మీనాక్షిజైన్ల నామినేట్
July 13, 2025
0
Tags