గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు ప్రమాణం స్వీకారం

Telugu Lo Computer
0


గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతి రాజు చేత గవర్నర్‌ బంగ్లా దర్బార్‌ హాలులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, ఏపీ మంత్రి లోకేశ్‌తోపాటు టీడీపీ ఎంపీలు, మంత్రులు హాజరయ్యారు. ఈనెల 14న గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతి రాజు నియమితులైన విషయం తెలిసిందే. పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై స్థానంలో గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అశోక్‌ 2014 నుంచి 2018 వరకు మోదీ మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఏపీ ప్రభుత్వంలో కూడా మంత్రిగా వ్యవహరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)