జూలై 25న లావా బ్లేజ్ డ్రాగన్ 5జీ విడుదల

Telugu Lo Computer
0


జూలై 25న లావా బ్లేజ్ డ్రాగన్ 5జీ విడుదల చేయనుంది. ఈ ఫోన్‌లో ఎక్కువగా 5G బ్యాండ్లకు మద్దతు అందించనుందని లావా తెలిపింది. ఈ 5G ఫోన్‌లో 6.745 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే (1612 × 720 pixels) ఉండేలా డిజైన్ చేశారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 450+ నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఇది యూజర్లకు స్మూత్ స్క్రోలింగ్, మెరుగైన విజువల్ అనుభవాన్ని అందించనుంది. దీనిలో Snapdragon 4 Gen 2 4nm మొబైల్ ప్లాట్‌ఫారమ్ ఉపయోగించబడింది. ఇందులో 2.2GHz A78 ఆధారిత 2 కోర్లు, 2GHz A55 ఆధారిత 6 కోర్లు ఉంటాయి. గ్రాఫిక్స్ కోసం Adreno 613 GPUను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల రోజువారీ వాడుక యాప్‌లు, మీడియా వినోదం, లైట్ గేమింగ్‌కు మంచి పనితీరు అందుతుంది. ఈ ఫోన్‌లో 4GB LPDDR4x RAM, 128GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అంతేకాకుండా microSD కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకునే అవకాశం కూడా ఉంది. ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో 50MP రియర్ కెమెరా లభించనుంది. LED ఫ్లాష్‌తో పాటు మంచి డిటైలింగ్ కలిగిన ఫోటోలను తీసేందుకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఇది 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. అలాగే 3.5mm ఆడియో జాక్, FM రేడియో, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 5, Bluetooth 5.4, USB Type-C పోర్ట్, GPS + GLONASS వంటి కీలక ఫీచర్లు ఇందులో ఉంటాయి. Android 15 ఓఎస్‌తో రానుంది. ఇది తాజా ఫీచర్లతో పాటు భద్రతా అప్‌డేట్లకు కూడా మద్దతు అందిస్తుంది. ఈ ఫోన్‌ను గోల్డెన్ మిస్ట్, మిడ్ నైట్ మిస్ట్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందించనున్నారు. ఇది రూ.10,000 లోపుగా ఉండనుందని కంపెనీ తెలిపింది. ఫోన్‌ను అమెజాన్, లావా వెబ్ సైట్ లో విక్రయించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)