పెరిగిన ఫార్చ్యూనర్ కారు ధర

Telugu Lo Computer
0


యోటా కిర్లోస్కర్ మోటార్ ఫార్చ్యూనర్ కొన్ని వేరియంట్ల ధరలను సవరించింది. ఫార్చ్యూనర్ రేంజ్‌లో మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్లను రూ.44.77 లక్షల(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ త్రీ-రో ఎస్‌యూవీ ధర దాదాపు రూ.68,000 పెరిగింది. ఈ కొత్త ధరలు స్టాండర్డ్ ఫార్చ్యూనర్‌తో పాటు ఫార్చ్యూనర్ లెజెండర్ రేంజ్‌కు కూడా వర్తిస్తాయి. ఈ ధరల పెంపుతో ఫార్చ్యూనర్‌ను కొనుగోలు చేయడం మరింత ఖరీదైనదిగా మారింది. టయోటా ఫార్చ్యూనర్ 4×2 పెట్రోల్ ఆటోమేటిక్ మోడల్ ధరలో రూ.68,000 పెరిగింది. ఇది ఈసారి జరిగిన ధరల పెంపులో అతి పెద్దది. దీనితో పాటు, 4×2 డీజిల్ మ్యాన్యువల్, 4×2 డీజిల్ ఆటోమేటిక్, 4×4 డీజిల్ మ్యాన్యువల్, GR-S, 4×4 డీజిల్ మ్యాన్యువల్ లెజెండర్, 4×4 ఆటోమేటిక్ లెజెండర్ వేరియంట్ల ధరలలో రూ.40,000 పెరిగాయి. ఈ ధరల పెంపు తర్వాత, టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ ఇప్పుడు రూ.36.05 లక్షల నుంచి రూ.52.34 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల మధ్య అందుబాటులో ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)