ఆంధ్రప్రదేశ్ లో బక్రీద్‌కు ఆవులు, ఒంటెలను వధిస్తే చర్యలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో బక్రీద్‌ పండుగ సందర్భంగా ఆవులు, దూడలు, ఒంటెలను వధిస్తే జంతు సంరక్షణ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ దామోదర్‌ నాయుడు హెచ్చరించారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాల ప్రకారం రాష్ట్రంలో ఈ జంతువుల వధపై నిషేధం ఉందని ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. ఈ చట్టాలను గౌరవించి, వీటిని వధించరాదని కోరారు. క్షేత్రస్థాయిలో పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని, జంతు వధను నివారించాలని పశుసంవర్ధక శాఖ సిబ్బందిని ఆయన ఆదేశించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)