ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వేళ కాశ్మీర్కు చెందిన 90 మంది విద్యార్థులు బుధవారం రాత్రి అర్మేనియా నుండి న్యూఢిల్లీ చేరుకోనున్నారు. ఉర్మియా యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని చాలా మంది విద్యార్థులు కూడా భారత దేశానికి తిరిగి వస్తున్నారు. విమానాశ్రయంలో ఉన్న విద్యార్థులు భారత ప్రభుత్వానికి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రభుత్వం మమ్మల్ని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇరాన్లోని భారతీయ విద్యార్థుల గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ "టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. భారతీయ విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీలైనంత త్వరగా టెహ్రాన్ వదిలి సురక్షిత ప్రదేశానికి చేరుకోవాలని భారత ప్రభుత్వం తన పౌరులందరికీ విజ్ఞప్తి చేసింది. మంగళవారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులకు సహాయం చేయడానికి సహాయ కేంద్రాన్ని కూడా ప్రారంభించింది. గత 6 రోజుల్లో ఇరాన్లో 585 మంది మరణించారు. 1,326 మంది గాయపడ్డారు. అదే సమయంలో ఇజ్రాయెల్లో 16 మందికి పైగా మరణించారు.
స్వదేశానికి చేరిన 90 మంది భారతీయ విద్యార్థులు
June 18, 2025
0
Tags