తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చింది. ఉద్యోగుల సమస్యల పై ఈ నెల 29న సమావేశాన్ని నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్, పంచా యితీ రాజ్ కార్యదర్శి లోకేశ్కుమార్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్లతో ప్రభుత్వం సబ్-కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగులు లేవనెత్తిన సమస్యల గురించి సబ్-కమిటీ అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. 29న సబ్-కమిటీ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలు, వాటి పరిష్కారంపై చర్చిచాలని నిర్ణయించారు. భట్టితో భేటీ తర్వాత ఉద్యోగుల జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు కీలక అంశాలన వెల్లడించారు. ఉద్యోగులకు రూ.11 వేల కోట్ల బకాయిలు చెల్లిస్తామని ఉప ముఖ్యమం త్రి హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)ను ప్రకటిస్తామని చెప్పారని వెల్ల డించారు. ఐదు డీఏలలో ఒకటి లేదా రెండింటిని అందజేస్తామని చెప్పారని వివరించారు. జూన్ 2న సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రకటన చేస్తారని చెప్పారు. ఈ మేరకు జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఉద్యోగుల అంశాల పైన ప్రభుత్వం కీలక ప్రకటన దిశగా కసరత్తు జరుగుతోంది. ఉద్యోగులు చాలా కాలంగా నిరీక్షిస్తున్న ఆరోగ్య పథకం విధి విధానాల పైన ఉద్యోగ సంఘాల నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేసారు. అదే విధంగా ఉద్యోగు సంఘాల విలీనం కు రంగం సిద్దమైంది.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం
May 28, 2025
0
Tags