కవితలో ఇంత ఆవేదనతో ఉందనే విషయం ఈ రోజే తెలిసింది !

Telugu Lo Computer
0


వితలో ఇంత ఆవేదనతో ఉందనే విషయం ఈ రోజే తెలిసిందని బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నారు. కవిత వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతుంది. కవితతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. కవిత సమస్యపై పార్టీలో తొందరలోనే కొలిక్కి వస్తుందని అనుకుంటున్నా. మీడియా చిట్ చాట్‌లో మాట్లాడిన దానికి పార్టీ ఎలా షోకాజ్ నోటీసులు ఎలా ఇస్తాము. టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి పనిచేశాం. ఒక బీజేపీతోనే మేము కలిసి పనిచేయలేదు. రాజకీయాల్లో ప్రకంపనలు సహజం. చాలా పార్టీల్లో ఇలాంటి ప్రకంపనలు చూశాం. మా పార్టీ మొదటిది కాదు , చివరిది కాదు. పార్లమెంట్ లో కరుణానిధి, అళగిరి, కనిములి ఫ్యామిలీ రాజకీయాలు చూశాం. సమస్యలు త్వరలోనే ఖచ్చితంగా సద్దుమణుగుతాయి. బీజేపీతో కలిసి పనిచేయాలనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునేవాళ్ళం ' అని వ్యాఖ్యానించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)