పాకిస్తాన్ తమ గగనతలాన్ని మూసేసినట్లు చేసిన ప్రకటన పూర్తిగా అబద్ధమని భారత విదేశాంగశాఖ తెలిపింది. పౌర విమానాలను నడపడానికి ఇప్పటికీ అనుమతిస్తోందని వెల్లడించింది. నిన్న భారత నగరాలపై టర్కిష్ తయారీ డ్రోన్లను రహస్యంగా ప్రయోగించిందని పేర్కొంది. పాకిస్తాన్ తన గగనతలంలో ఎగురుతున్న అనుమానించని పౌర విమానాలను కవచాలుగా వాడుకుంటోందని భారత విదేశాంగశాఖ ఇవాళ వెల్లడించింది. ఉత్తర భారతదేశం అంతటా పౌర భవనాలు, సైనిక స్థావరాలు, మతపరమైన నిర్మాణాల వైపు కనీసం 300-400 పాకిస్తానీ డ్రోన్లు దూసుకొచ్చినట్లు విదేశాంగశాఖ తెలిపింది. ఇవాళ సాయంత్రం కూడా పాకిస్తాన్ గగనతలంలో కొన్ని పౌర విమానాలు ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్సైట్లలో కనిపించాయని పేర్కొంది. అయితే భారతదేశం వైపు విమానాలు ఏవీ రాలేదని తెలిపింది. భారతదేశ వైమానిక రక్షణ నెట్వర్క్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుందని తెలిపింది. జమ్మూ మరియు కాశ్మీర్లోని పూంచ్లో పాకిస్తాన్ చేసిన భారీ షెల్లింగ్ స్ధానికంగా ఓ పాఠశాలలోని ఇద్దరు విద్యార్థుల ఇంటిని తాకిందని, ఈ దాడిలో వారు చనిపోయినట్లు విదేశాంగశాఖ తెలిపింది. దేవాలయాలు, గురుద్వారాలు, కాన్వెంట్లను లక్ష్యంగా చేసుకోవడం పాకిస్తాన్ చేసిన కొత్త దారుణమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. పాకిస్తాన్ కొన్ని ప్రాంతాలలో టర్కిష్ తయారీ అసిస్గార్డ్ సోంగర్ సాయుధ డ్రోన్లను ప్రయోగించిందని ఆయన తెలిపారు. భారత వైమానిక రక్షణ నెట్వర్క్ వాటిలో చాలా వాటిని జామ్ చేసి, మరికొన్నింటిని కూల్చివేసిందని పేర్కొన్నారు.
పాకిస్తాన్ గగనతలాన్ని మూసేసినట్లు చేసిన ప్రకటన అవాస్తవం
May 09, 2025
0
Tags