నాగం జనార్దన్‌రెడ్డి పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Telugu Lo Computer
0


తెలంగాణలో సుదీర్ఘకాలంగా ఉన్నాను, నాకు కాళేశ్వరం గురించి తెలుసు. ప్రపంచంలో అతి పెద్ద ఎత్తిపోతల పథకం అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సతీశ్‌చంద్ర శర్మ అన్నారు. నీటి ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాల కోసం చేపడతారు, ప్రాజెక్టులతో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ పేర్కొన్నారు. పాలమూరులో అవినీతి లేదు, సీబీఐ దర్యాప్తు అక్కర్లేదని  జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ నాగరత్న బెంచ్‌ స్పష్టం చేశారు. నీటి ప్రాజెక్టులపై రాజకీయాలు చేయడం తగదని పిటిషనర్లకు హితవు పలుకుతూ నాగం జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేసారు.

Post a Comment

0Comments

Post a Comment (0)